పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : శ్రీమానినీచోర దండకము

  •  
  •  
  •  

10.1-1246-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన నక్రూరుండు పురంబునకుం జని రామకృష్ణులు వచ్చిరని కంసున కెఱింగించి తన గృహంబునకుం జనియె; నంత నపరాహ్ణంబున బలభద్ర గోపాల సహితుండై కృష్ణుండు.

టీకా:

అని = అని; పలికిన = చెప్పగా; అక్రూరుండు = అక్రూరుడు; పురంబున్ = నగరమున; కున్ = కు; చని = వెళ్లి; రామ = బలరామ; కృష్ణులు = కృష్ణులు; వచ్చిరి = వచ్చారు; అని = అని; కంసున్ = కంసుని; కున్ = కి; ఎఱింగించి = తెలిపి; తన = తన యొక్క; గృహంబున్ = నివాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = ఆ తరువాత; అపరాహ్ణంబున = మధ్యాహ్నవేళ యందు; బలభద్ర = బలరాముడు; గోపాల = గోపకులతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కృష్ణుండు = కృష్ణుడు.

భావము:

ఇలా చెప్పిన శ్రీకృష్ణుడి మాటలు విని, అక్రూరుడు నగరంలోకి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెల్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు మధ్యాహ్నం సమయంలో బలరాముడు గోపకులు తాను కలిసి మథురానగరం ప్రవేశించాడు.