పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వ్రేతలు కలగుట

  •  
  •  
  •  

10.1-1219-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఫుల్లసరోజలోచనలు పూర్ణసుధాంశుముఖుల్ పురాంగనల్
మెల్లనె యెల్లి పట్టణము మేడలనుండి సువర్ణ లాజముల్
ల్లఁగ వారిఁ జూచి హరి సంగతి చేయఁదలంచుఁ గాక వ్రే
ల్లె వసించు ముద్దియలపైఁబడ నేల తలంచు నక్కటా!

టీకా:

పుల్ల = వికసించిన; సరోజ = పద్మములవంటి; లోచనలు = కన్ను లున్నవారు; పూర్ణ = నిండు; సుధాంశు = చంద్రుని వంటి; ముఖుల్ = మోములు కలవారు; పురా = పట్టణపు; అంగనల్ = స్త్రీలు; మెల్లనె = మెల్లగా; యెల్లి = రేపు; పట్టణము = పట్టణములోని; మేడల = భవనములపై అంతస్థుల; నుండి = నుండి; సువర్ణ = బంగారపు; లాజముల్ = పేలాలు; చల్లగా = వేయగా; వారిన్ = వారిని; చూచి = చూసి; హరి = కృష్ణుడు; సంగతిచేయన్ = కలియవలెనని; తలంచున్ = భావించును; కాక = కాక; వ్రేపల్లెన్ = గొల్లపల్లెను; వసించున్ = ఉండెడి; ముద్దియల = ముగ్ధల; పైబడన్ = కలియుటకు; ఏల = ఎందుకు; తలంచున్ = భావించును; అక్కటా = అయ్యో.

భావము:

వికసించిన పద్మముల వంటి కన్నులూ, పున్నమి చంద్రుని వంటి మోమూ కల మథురాపురం లోని అందగత్తెలు రేపు మేడలెక్కి బంగారపు లాజలు మెల్లగా తనపై చల్లుతారు. చల్లగా వారిని చూసాకా కృష్ణుడు వారిన కలవాలని అనుకుంటాడు అంతే కాని, అయ్యో! వ్రేపల్లెలోని గోపికల పొందు ఎందుకు కోరుకుంటాడు.