పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుడు బలకృష్ణుల గనుట

  •  
  •  
  •  

10.1-1202-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని వారల పాదములకు
వియంబున మ్రొక్కె భక్తి వివశుం డగుచుం
నువునఁ బులకాంకురములు
మొయఁగ నానందబాష్పములు జడిఁ గురియన్.

టీకా:

కని = చూసి; వారలన్ = వారి; పాదముల్ = కాళ్ళ; కున్ = కు; వినయంబునన్ = అణకువతో; మ్రొక్కి = నమస్కరించి; భక్తిన్ = భక్తితో; వివశుండు = పరవశత్వం పొందినవాడు; అగుచున్ = అగుచు; తనువు = దేహము; పులకాంకురములు = గగుర్పాటులు; మొనయగన్ = కలుగగా; ఆనంద = ఆనందముతో కలిగిన; బాష్పములు = కన్నీరు; జడిన్ = జలజల; కురియన్ = వర్షించగా.

భావము:

అలా చూసిన అక్రూరుడు భక్తిపరవశుడు అయ్యాడు. దేహం పులకించింది. ఆనందాశ్రువుల జాలువారుతుండగా, ఆ రామకృష్ణుల పాదాలకు వినయంతో నమస్కరించాడు.