పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వ్యోమాసురుని సంహారించుట

  •  
  •  
  •  

10.1-1185-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లో దొంగలలో మయాసురసుతుం డాద్యుండు వ్యోముండు గో
పాలుండై చని మేషకల్పనలతో భాసిల్లి క్రీడించు త
ద్బా వ్రాతము నెల్ల మెల్లనఁ జతుఃపంచావశిష్టంబుగా
శైలాంతర్గుహలోనికిం గొనిచనెం జౌర్యం బవార్యంబుగన్.

టీకా:

ఆలోన్ = ఆలోపల; దొంగల = చోరుల; లోన్ = అందు; మయా = మయుడను; అసుర = రాక్షసుని; సుతుండు = కొడుకు; ఆద్యుండు = మొదటివాడు; వ్యోముండు = వ్యోముడనువాడు; గోపాలుండు = గొల్లవానివలె; ఐ = అయ్యి; చని = వెళ్ళి; మేష = గొఱ్ఱెలను; కల్పనలు = కల్పించుకొనుటల; తోన్ = తోటి; భాసిల్లి = అతిశయించి; క్రీడించు = ఆడుచున్నట్టి; తత్ = ఆ యొక్క; బాల = పిల్లల; వ్రాతమున్ = సమూహము; ఎల్లన్ = అంతటను; మెల్లనన్ = మెల్లిమెల్లిగా; చతుః = నలుగురు; పంచః = ఐదుగురు; అవశిష్టంబు = మాత్రమే మిగులుట; కాన్ = అగునట్లు; శైల = కొండ; అంతర్ = లోని; గుహ = గుహ; లోని = లోపలి; కిన్ = కి; కొని = తీసుకొని; చనెన్ = పోయెను; చౌర్యంబు = దొంగతనపునేర్పు; అవార్యంబు = అడ్డులేనిది; కాన్ = అగునట్లు.

భావము:

అంతలో మయుడనే రాక్షసుడి పెద్ద కొడుకు వ్యోమాసురుడు గొల్లపిల్లాడి రూపం ధరించి, దొంగగా ఏర్పడిన వారిలో చేరాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొఱ్ఱెలుగా నటిస్తున్న గొల్లపిల్లలలో నలుగురు ఐదుగురిని తప్పించి మిగిలిన వారిని అందరినీ మెల్లగా ఒక పర్వతగుహలోకి తీసుకుపోయాడు.