పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కేశిని సంహారము

  •  
  •  
  •  

10.1-1169-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భీణ ఘోటక దానవ
హేషానిర్ఘోషభిన్న హృదయ నిఖిల గో
యోషా పురుషార్భకమై
ఘోము హరి చూడ దైన్యఘోషం బయ్యెన్.

టీకా:

భీషణ = భయంకరమైన; ఘోటక = గుఱ్ఱపు రూపున ఉన్న; దానవ = రాక్షసుని; హేషా = సకిలింతల; నిర్ఘోష = అధికమైన ధ్వనిచేత; భిన్న = పగిలిన; హృదయ = గుండెలు కలిగిన; నిఖిల = సమస్తమైన; గో = ఆవులు; యోషా = స్త్రీలు; పురుష = మగవారు; అర్భకము = పిల్లలు కలది; ఐ = అయ్యి; ఘోషము = మంద; హరి = కృష్ణుడు; చూడన్ = చూచుచుండగా; దైన్యఘోషంబు = మొర ఇడెడి ధ్వని కలది; అయ్యెన్ = అయినది.

భావము:

దారుణమైన అశ్వాకారంలో ఉన్న ఆ రాక్షసుడి సకిలింత వినబడేసరికి, అక్కడున్న ఆవులు, దూడలు, స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరి హృదయాలు దద్ధరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే ఆ గొల్లపల్లె అంతా దీనంగా ఘోషించసాగింది.