పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసు డక్రూరునితో మాట్లాడుట

  •  
  •  
  •  

10.1-1165-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పంపినఁ బోనివాఁడనె నృపాలక! మానవు లెన్న తమ్ము నూ
హింరు దైవయోగముల నించుకఁ గానరు తోఁచినట్లు ని
ష్కంగతిం చరింతు రది గాదన వచ్చునె? యీశ్వరేచ్ఛఁ ద
ప్పింపఁగ రాదు నీ పగతు బిడ్డలఁ దెచ్చెదఁ బోయి వచ్చెదన్."

టీకా:

పంపినన్ = వెళ్ళ మని చెప్పినచో; పోని = వెళ్ళకుండా ఉండెడి; వాడనె = వాడనా; నృపాలకా = రాజా; మానవులు = మనుష్యులు; ఎన్నన్ = తరచి చూస్తే; తమ్మున్ = తమ స్థితిని; ఊహింపరు = ఆలోచించుకొనరు; దైవయోగములన్ = దైవికముగ కలిగెడివానిని; ఇంచుకన్ = కొంచెమైనను; కానరు = తెలిసికొనలేరు; తోచినట్లు = తోచిన విధముగ; నిష్కంప = చలించని; గతిన్ = విధముగ; చరింతురు = మెలగెదరు; అదికాదు = అలా కాదు; అనవచ్చునె = అనుట వీలగునా, కాదు; ఈశ్వర = భగవంతుని; ఇచ్ఛన్ = నిర్ణయము; తప్పింపగన్ = తప్పించుకొనుట; రాదు = శక్యము కాదు; నీ = నీ యొక్క; పగతు = శత్రువు యొక్క; బిడ్డలన్ = పిల్లలను; తెచ్చెదన్ = తీసుకుస్తాను; పోయివచ్చెదన్ = వెళ్ళివస్తాను.

భావము:

“ఓ రాజా! నీవు ఆజ్ఞాపిస్తే వెళ్ళకుండా ఉంటానా? నిజానికి నరులు తమ శక్తి ఎలాంటిదో? దైవశక్తి ఎలాంటిదో? కొంచెము కూడ గ్రహించ లేరు. వారికి తోచినట్లు పట్టుదలతో ప్రవర్తిస్తుంటారు. దానిని కాదనలేం కదా. విధి నిర్ణయం తప్పించడం ఎవరి తరమూ కాదు. నేను వెళ్ళి నీ విరోధిపుత్రులను ఇక్కడికి తీసుకువస్తాను.”