పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసుని మంత్రాలోచన

  •  
  •  
  •  

10.1-1152-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఎందున్ నన్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులుం జాల రీ
బృందారణ్యము మంద నిప్పుడు మదాభీరార్భకుల్ రామ గో
విందుల్ వర్ధిలుచున్న వారఁట రణోర్విం గంసుని ద్రుంతు మం
చున్ ర్పంబులు పల్కుచుందు రఁట యీ చోద్యంబులన్ వింటిరే?

టీకా:

ఎందున్ = ఎన్నడు; నన్ను = నన్ను; ఎదిరించి = ఎదిరించి; పోరుట = యుద్ధమున; కున్ = కు; దేవేంద్ర = దేవేంద్రుడు; ఆదులున్ = మొదలగువారు కూడ; చాలరు = సమర్థులు కారు; ఈ = ఇక్కడి; బృందారణ్యమున్ = బృందావనములోని; మందన్ = గొల్లపల్లెలో; ఇప్పుడు = ఇప్పుడు; మద = మదమెక్కిన; ఆభీర = గొల్ల; అర్భకుల్ = పిల్లలు; రామ = బలరాముడు; గోవిందుల్ = కృష్ణులు; వర్ధిల్లుచున్నవారు = పెరుగుతున్నారు; అట = అట; రణ = యుద్ధ; ఉర్విన్ = భూమి యందు; కంసున్ = కంసుడిని; నొప్పింతుము = దెబ్బతీసెదము; అంచున్ = అని; దర్పంబులున్ = గర్వపుమాటలు; పల్కుచుందురు = చెప్పుచుందురు; అట = అట; ఈ = ఈ; చోద్యంబులన్ = విచిత్రములను; వింటిరే = విన్నారా.

భావము:

“ఎక్కడైనా, ఇంద్రాదులకు సైతం నన్ను ఎదిరించి పోరాడా లంటే శక్తి చాలదు. అలాంటిది, బలరామకృష్ణులు అనే మదించిన గొల్లపిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారుట. “కదనభూమిలో కంసుణ్ణి చంపుతా” మంటూ బీరాలు పలుకుతున్నారుట. మీరు ఈ వింత మాటలు విన్నారా?