పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసునికి నారదుడు జెప్పుట

  •  
  •  
  •  

10.1-1149-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుఁడొకనాడు నారదుఁడు కంసునితోడ యశోద కూఁతు దాఁ
నుటయుఁ జక్రి దేవకికి ర్భజుఁ డౌటయు మున్ను రోహిణీ
యుఁడు రాముఁడౌటయును ద్విభు లిద్దఱు మంద నున్నవా
ని యెఱుఁగంగఁ జెప్పిన మహాద్భుత మంచుఁ జలించి గిన్కతోన్.

టీకా:

ఘనుడు = గొప్పవాడు; ఒకనాడు = ఒకరోజు; నారదుడు = నారదుడు; కంసుని = కంసుడి; తోడన్ = తోటి; యశోద = యశోదాదేవి; కూతున్ = పుత్రికను; తాన్ = ఆమె; కనుటయున్ = ప్రసవించుట; చక్రి = విష్ణుమూర్తి; దేవకి = దేవకీదేవి; కిన్ = కి; గర్భజుడు = కడుపున పుట్టినవాడు; ఔటయున్ = అగుట; మున్ను = అంతకుముందు; రోహిణీ = రోహిణీదేవి; తనయుడు = కొడుకు; రాముడు = బలరాముడు; ఔటయున్ = అగుట; తత్ = ఆ యొక్క; విభులు = వైభవములు కలవారు; ఇద్దఱున్ = ఇద్దరు (2); మందన్ = వ్రేపల్లె యందు; ఉన్నవారు = ఉన్నారు; అని = అన; ఎఱుగంగన్ = తెలియునట్లు; చెప్పినన్ = చెప్పగా; మహా = చాలా; అద్భుతము = ఆశ్చర్యకరమైనది; అంచున్ = అని; చలించి = కలవరపడి; కిన్క = కోపము; తోన్ = తోటి.

భావము:

తరువాత ఒకరోజు, మహానుభావుడైన నారదుడు కంసుని దగ్గరకు వచ్చి “అ బాలిక యశోద కన్న కన్నె, శ్రీకృష్ణుడు దేవకీగర్భ సంభూతుడు, బలరాముడు రోహిణి కొడుకు, ఆ రామకృష్ణులు ఇద్దరు నందుని మందలో ఉన్నారు” అని తెలియ చెప్పాడు. ఆయన మాటలు విని, ఆశ్చర్యపోయి, ఆగ్రహావేశాలతో కంసుడు కంపించిపోయాడు.