పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల విరహాలాపములు

  •  
  •  
  •  

10.1-1135-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దె భానుం డపరాద్రిఁ జేరె; నిదె సాయంకాల మేతెంచె; న
ల్లదె గోపాదపరాగ మొప్పెసఁగె; బృందారణ్యమార్గంబు నం
దిదె వీతెంచె వృషేంద్రఘోషము; ప్రియుం డేతెంచె రం డంచుఁ దా
మెదు రేతెంతురు మాపు కృష్ణునికి న య్యింతుల్ పరిభ్రాంతలై.

టీకా:

అదె = అదిగో; భానుండు = సూర్యుడు; అపరాద్రిన్ = పడమటి కొండ యందు; చేరెన్ = చేరెను; ఇదె = ఇదిగో; సాయంకాలము = సాయంత్రము; ఏతెంచెన్ = వచ్చెను; అల్లదె = అదిగో; గో = గోవుల; పాద = కాలి; పరాగము = ధూళి; ఒప్పు = చక్కదనము; ఎసగెన్ = విజృంభించెను; బృందారణ్య = బృందావనము యొక్క; మార్గంబున్ = దారి; అందు = లో; ఇదె = ఇదిగో; వీతెంచెన్ = వీచింది; వృషేంద్ర = ఎద్దుల; ఘోషము = ఱంకెల చప్పుడు; ప్రియుండు = కృష్ణుడు; ఏతెంచెన్ = వచ్చెను; రండు = రండి; అంచున్ = అని; తాము = వారు; ఎదురు = ఎదురుగా; ఏతెంతురు = వస్తారు; మాపు = సాయంత్రపువేళ; కృష్ణుని = కృష్ణుని; కిన్ = కి; ఆ = ఆ; ఇంతులు = యువతులు; పరి = మిక్కిలి; భ్రాంతలు = భ్రాంతిపొందినవారు; ఐ = అయ్యి.

భావము:

సాయంకాలం కాగానే, అదిగో సూర్యుడు పడమటి కొండకు చేరుతున్నాడు. సాయంకాల మయింది. అదిగో గోధూళి రేగింది. బృందావన వీధుల నుండి ఎద్దుల రంకెలు వినిపిస్తున్నాయి. “వల్లభుడు వచ్చేస్తున్నాడు, రండమ్మా రండి!” అంటూ గోపకాంతలు సంభ్రమంతో సంతోషంతో కృష్ణుడికి ఎదురేగుతారు.