పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రాసక్రీడా వర్ణనము

  •  
  •  
  •  

10.1-1089-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాలతోడను రాసము
రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో
రాములమీఁద వియచ్చర
రాలు మూర్ఛిల్లిపడిరి రామవినోదా!

టీకా:

రామలు = పడతుల {రామ – రమింప జేయునామె, స్త్రీ}; తోడను = తోటి; రాసమున్ = రాసక్రీడను; రామానుజుండు = కృష్ణుడు {రామానుజుడు - బలరాముని తోబుట్టువు, కృష్ణుడు}; ఆడన్ = ఆడుతుండగ; చూచి = చూసి; రాగిల్లి = రక్తిని పొంది; మనోరాముల = భర్తల; మీదన్ = పైన; వియచ్చర = దేవతా {వియచ్చరులు - ఆకాశమున చరించువారు, దేవతలు}; రామలు = స్త్రీలు; మూర్ఛిల్లి = ఆనందముతో చొక్కి; పడిరి = వాలిపోయిరి; రామవినోదా = పరీక్షిన్మహారాజా {రామ వినోదుడు - రామ (పరబ్రహ్మము, ప్రమాణము శ్లో. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని, ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మాభియతే.) అందు వినోదించువాడు, పరీక్షిత్తు}.

భావము:

రాజయోగివి అయిన పరీక్షిత్తు! గోవిందుడు గోపికలతో రాసలీల జరుపుతుండగా చూసి, కామపీడితులై గగనచర భామినులు పారవశ్యంతో తూలి సోలి తమ తమ ప్రాణేశ్వరుల మీదకు వాలిపోయారు.
(రామవినోదుల కోసమట ఈ పద్యం. రామ తారక మంత్ర అనుప్రాసతో ఈ పద్యం ప్రతి పాదంలో అలంకరించారు మన పోతనామాత్యులు. హాయిగా ఆస్వాదించి వినోదించండి రామవినోదుల్లారా! గోపికలను బాలజ్ఞానులు అనుకుంటే, వారిలో రామలు ఇక్కడ పరతత్వంలో రమిస్తున్నవారట. వారితో పరబ్రహ్మ స్వరూపుడు కృష్ణుడు బ్రహ్మరసక్రీడ జరుపుతుంటే. ఖేచరరామలు అయిన సిద్ధిపొందిన జ్ఞానులు ఆకాశమంత ఉన్నత స్థాయిలో వారు ఆనందపారవశ్యం పొందారట. పొంది మనోరాములు బ్రహ్మజ్ఞానుల సత్సాంగత్యం వైపు మరలారట.)