పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వసుదేవుడు కృష్ణుని పొగడుట

  •  
  •  
  •  

10.1-125-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనుచుండ దేవకీదేవి మహాపురుషలక్షణుండును, విచక్షణుండును, సుకుమారుండును నైన కుమారునిం గని, కంసునివలని వెఱపున శుచిస్మితయై యిట్లనియె.

టీకా:

అనుచుండన్ = అని పలుకుతుండగా; దేవకీ = దేవకి అనెడి; దేవి = ఉత్తమురాలు; మహాపురుష = మహాపురుషుల యొక్క {మహాపురుషలక్షములు - సాముద్రిక శాస్త్రమున చెప్పబడిన శంఖ చక్ర వజ్ర పద్మ హలాది చిహ్నములు}; లక్షణుండును = లక్షణములు కలవాడు; విచక్షణుండును = ఙ్ఞాని నేర్పరి ఐనవాడు; సుకుమారుండును = కోమల దేహము కలవాడు; ఐన = అయిన; కుమారునిన్ = పుత్రుని; కని = కనుగొని, ఉద్దేశించి; కంసుని = కంసుని; వలని = మూలమున; వెఱపునన్ = బెదురుతో; శుచి = స్వచ్ఛమైన; స్మిత = చిరునవ్వు కలామె; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా వసుదేవుడు అంటూ ఉండగా, దేవకీదేవి కొడుకును చూసింది. అతడు మహాపురుషుల సాముద్రిక లక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు చక్కని చూపులు కలవాడు, చాలా సుకుమారుడు అయ్యి ఉన్నాడు. కంసుని పేరు వినబడగానే దేవకీదేవి భయపడింది. శుచి అయి చక్కటి చిరునవ్వు కలది అయి ఆ దేవదేవుని వంక చూసి ఇలా అంది.