పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలకు ప్రత్యక్షమగుట

  •  
  •  
  •  

10.1-1073-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమయోగి హృదయ ద్రపీఠంబుల
నుండు మేటి వ్రజవధూత్తరీయ
పీఠమున వసించి పెంపారెఁ ద్రిభువన
దేవి లక్ష్మి మేనఁ దేజరిల్ల

టీకా:

పరమ = అతిగొప్ప; యోగి = యోగుల యొక్క; హృదయ = హృదయములు అనెడి; భద్ర = శుభ స్వరూపములైన; పీఠంబులన్ = స్థానము లందు; ఉండు = ఉండెడి; మేటి = గొప్పవాడు; వ్రజ = గోపికా; వధూ = స్త్రీల; ఉత్తరీయ = పైటలచే ఏర్పరచిన; పీఠమునన్ = ఆసనము నందు; వసించి = కూర్చుండి; పెంపారెన్ = అతిశయించెను; త్రిభువన = ముల్లోకములను ప్రకాశింప జేసెడి; దేవి = దివ్యమైన; లక్ష్మి = లక్ష్మీదేవి; మేనన్ = తన దేహము నందు; తేజరిల్ల = విరాజిల్లగా.

భావము:

యోగీశ్వరుల హృదయములు అనే సుఖాసనము లందు అధివసించే ఆ పరమాత్ముడు. ముల్లోకాల సౌందర్యలక్ష్మి తన మేన ఉద్దీపించగా గొల్లముగ్ధల పైట కొంగులతో కల్పించిన శయ్య మీద ఆసీనుడయ్యాడు.