పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల విరహపు మొరలు

  •  
  •  
  •  

10.1-1048-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘోషభూమి వెడలి గోవుల మేపంగ
నీరజాభమైన నీ పదములు
సవు శిలలు దాఁకి డునొచ్చునో యని
లఁగు మా మనములు మలనయన!

టీకా:

ఘోషభూమిన్ = వ్రేపల్లెను; వెడలి = బయటకు వచ్చి; గోవులన్ = ఆవులను; మేపంగన్ = కాచుటకు; నీరజ = పద్మములకు; ఆభము = సమానమైనవి; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; పదములు = పాదములు; కసవు = గడ్డి; శిలలున్ = రాళ్ళు; తాకి = తగిలి; కడున్ = బాగా; నొచ్చునో = నొప్పెట్టునేమో; అని = అని; కలగున్ = కలతచెందును; మా = మా యొక్క; మనములు = మనస్సులు; కమలనయన = పద్మాక్షా, కృష్ణా.

భావము:

ఓ కమలాక్షా! నీవు గోవులను మేపుడం కోసం వ్రేపల్లె నుండి బయలుదేరిన దగ్గర నుండి పద్మాలతో సమానమైన నీ పాదములకు గడ్డిమొలకలు, గులకరాళ్ళు తాకి ఎంతో నెప్పి పెడతాయేమో అని మా మనసులు కుందుతుంటాయి.