పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల తాదాన్యతోన్మత్తత

  •  
  •  
  •  

10.1-1033-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుల దైన్యంబును భామల క్రౌర్యంబుఁ-
జూపుచు విభుఁ డొక్క సుదతితోడ
విహరింప నది యెల్ల వెలఁదుల వర్జించి-
  "నా యొద్దనున్నాఁడు నాథుఁ"డనుచు
ర్వించి రాఁ జాలఁ "మలాక్ష! మూఁపున-
నిడుకొను"మనుఁడు న య్యీశ్వరుండు
మొఱఁగి పోయినఁ దాపమును బొంది "యో! కృష్ణ!-
యెక్కడఁ జనితి ప్రాణేశ! రమణ!

10.1-1033.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీకు వరవుడ నయ్యెద నిలువు" మనుచు
గవఁ గొందఱు కాంతలా నితఁ జూచి
"రుఁడు మన్నింప గర్వించి నజనేత్ర
చిక్కె నేఁ" డని వెఱఁగును జెంది రపుడు.

టీకా:

పతుల = భర్తల; దైన్యంబును = దీనత్వమును; భామల = స్త్రీల యొక్క; క్రౌర్యంబును = క్రూరత్వమును; చూపుతు = కనబరచుచు; విభుడు = కృష్ణుడు; ఒక్క = ఒకానొక; సుదతి = స్త్రీ; తోడన్ = తోటి; విహరింపన్ = క్రీడించగా; అది = ఆమె; ఎల్ల = అందరు; వెలదులన్ = స్త్రీలను; వర్జించి = వదలిపెట్టి; నా = నా; యొద్దన్ = దగ్గర; ఉన్నాడు = ఉన్నాడు; నాథుడు = ప్రభువు; అనుచు = అని; గర్వించి = గర్వముపొంది; రాజాలన్ = రాలేను; కమలాక్ష = పద్మాక్షుడా, కృష్ణుడా; మూపునన్ = వీపుమీద; ఇడుకొనుము = ఎక్కించుకొనుము; అనుడున్ = అనగా; ఆ = ఆ; ఈశ్వరుండు = కృష్ణుడు; మొఱగి = కనుమొరగి; పోయినన్ = వెళ్ళిపోగా; తాపమును = విచారమును; పొంది = పొంది; ఓ = ఓ; కృష్ణ = కృష్ణుడా; ఎక్కడన్ = ఎక్కడకు; చనితి = వెళ్ళిపోతివి; ప్రాణేశా = నా ప్రాణనాథా; రమణ = ప్రియుడా.
నీ = నీ; కున్ = కు; వరవుడు = దాసురాలను; అయ్యెదన్ = అయ్యి ఉండెదను; నిలువుము = ఆగుము; అనుచున్ = అని; వగవన్ = విచారించగా; కొందఱు = కొంతమంది; కాంతలు = స్త్రీలు; ఆ = ఆ యొక్క; వనితన్ = స్త్రీని; చూచి = చూసి; వరుడు = విభుడు; మన్నింపన్ = ఆదరించగా; గర్వించి = గర్వముచెంది; వనజనేత్ర = ఇంతి {వనజనేత్ర - పద్మాక్షి, స్త్రీ}; చిక్కెన్ = చిక్కిపోయినది; నేడు = ఈ దినము; అని = అని; వెఱగును = ఆశ్చర్యమును; చెందిరి = పొందిరి; అపుడు = ఆ సమయమునందు.

భావము:

ఆ సమయాన పతులు పడతులకు లొంగిపోయి పొందే దైన్యమును, స్త్రీలు చూపే దౌర్జన్యమునూ తెలపడం కోసం, కృష్ణుడు ఒక చెలువతో కలసిమెలసి విహరించాడు. అంతలోఆ నెలత తక్కిన వనితలు అందరినీ వదలి వల్లభుడు తననే వలచి వచ్చి తన దగ్గరే ఉన్నాడని విఱ్ఱవీగింది. ఆ గర్వంతోనే అది “ఓ కృష్ణా! ఇక నడచి రాలేను. నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళు” అని పలికింది. ఆ మాట అనగానే అచ్యుతుడు అంతర్ధానం చెందాడు. అప్పుడు ఆ వనిత పరితాపం పొంది “ఓ కృష్ణా! ఓ ప్రాణేశ్వరా! ఓ వల్లభా! ఎక్కడికి వెళ్ళిపోయావు. నీకు చరణదాసిని అవుతాను. నిలువుము.” అంటూ పలవరించింది. అప్పుడు కొందరు గోపికలు ఆ సుందరిని చూసి “మగడి మన్ననతో దర్పించి ఈ చిన్నది ఇలా ఇక్కట్లకు పాలయింది” అని ఆశ్చర్యపోయారు.