పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల తాదాన్యతోన్మత్తత

  •  
  •  
  •  

10.1-1022-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లోకమెల్లఁ గుక్షిలోపల నున్నది
మాధవుండ నేను మాత వీవు
చూడు" మనుచు నొక్క సుందరి యొకతెకు
ముఖము దెఱచి చూపు ముఖ్యచరిత!

టీకా:

లోకము = జగత్తు; ఎల్లన్ = సమస్తము; కుక్షి = కడుపు; లోన్ = అందు; ఉన్నట్టి = ఉన్నటువంటి; నేను = నేను; మాధవుండన్ = కృష్ణుడను; మాతవు = తల్లివి; ఈవు = నీవు; చూడుము = చూడు; అనుచన్ = అని; ఒక్క = ఒకానొక; సుందరి = స్త్రీ; ఒకతె = ఒకామె; కున్ = కు; ముఖము = నోరు; తెఱచి = తెరిచి; చూపున్ = చూపించును; ముఖ్యచరిత = పరీక్షిన్మహారాజా {ముఖ్య చరితుడు - ముఖ్య (ఉత్తమమైన) చరితుడు (వర్తన కలవాడు), పరీక్షిత్తు}.

భావము:

ఉత్తమ చరిత్రుడవైన పరీక్షన్మహారాజా! ఒక గోపిక మాధవుడై “విశ్వమంతా నా కుక్షిలోఉంది చూడ” మంటూ యశోదమ్మగా నటిస్తున్న మరొక గోపికకు తన నోరు తెరచి చూపించింది.