పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఆత్మారాముడై రమించుట

  •  
  •  
  •  

10.1-1007-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిక్కక యీశుఁడై యెదిరిఁ జిక్కులఁ బెట్టెడు మాయలానికిం
జిక్కి కృతార్థలై మరుని చిక్కులఁ జొక్కి లతాంగు లుండగా
క్కువ శాంతి చేయుటకు న్ననఁ జేసి ప్రసన్నుఁ డౌటకుం
క్కన నా విభుండు గుణశాలి తిరోహితుఁడయ్యె న య్యెడన్.

టీకా:

చిక్కక = దొరకకుండ; ఈశుడు = వ్యాపకుడు; ఐ = అయ్యి; ఎదిరి = ఎదుటివారిని; చిక్కులన్ = ఇబ్బందులను; పెట్టెడు = పెట్టునట్టి; మాయలాని = మాయలు చేయువాని; కిని = కి; చిక్కి = లొంగిపోయి; కృతార్థలు = ధన్యులు; ఐ = అయ్యి; మరుని = మన్మథుని; చిక్కులన్ = తబ్బిబ్బు లందు; చొక్కి = పరవశలై; లతాంగులు = పడతులు {లతాంగి - లత వంటి దేహముకలామె, స్త్రీ}; ఉండగా = ఉండగా; మక్కువన్ = ప్రేమోద్రేకమును; శాంతి = ఉపశమింప; చేయుట = చేయుట; కున్ = కు; మన్నన = ఆదరించుట; చేసి = చేసి; ప్రసన్నుడు = అనుగ్రహించువాడు; ఔట = అగుట; కున్ = చేత; చక్కనన్ = చక్కగా; ఆ = ఆ; విభుండు = ప్రభువు; గుణశాలి = మంచి గుణముల వాడు; తిరోహితుడు = కానరానివాడు; అయ్యెన్ = అయ్యెను; అయ్యెడన్ = అప్పుడు.

భావము:

పరమేశ్వరుడై ఎవరికీ చిక్కక ఎదుటివారిని చిక్కుల్లో ముంచే మాయల వాడికి దక్కి ధన్యురాండ్రై ఆ గోపాంగనలు మదనకేళిలో సొక్కి సోలిపాయారు. ఆ సమయంలో వారి కామోత్కంఠకు శాంతి కలిగించే టందుకూ, అనంతరం ఆదరంతో అనుగ్రహించే టందుకూ, కల్యాణగుణ పరిపూర్ణుడైన ఆ పరమాత్ముడు అదృశ్యమైపోయాడు.