పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఆత్మారాముడై రమించుట

  •  
  •  
  •  

10.1-1003-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు కుసుమశరుని శరపరంపరా పరవశలై యోపికలు లేక పలికిన గోపికల దీనాలాపంబులు విని, నవ్వి యోగీశ్వరేశ్వరుండైన కృష్ణుం డాత్మారాముండై వారలతో రమించె నప్పుడు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; కుసుమశరుని = మన్మథుని; శర = బాణముల; పరంపరా = ఎడతెగక తాకుటచే; పరవశలు = స్వాధీనత తప్పినవారు; ఐ = అయ్యి; ఓపికలు = నిబ్బరములు; లేక = లేక; పలికిన = పలికినట్టి; గోపికల = గొల్లభామల; దీనాలాపంబులు = మొరలు; విని = వినినను; నవ్వి = నవ్వి; యోగీశ్వరేశ్వరుండు = కృష్ణుడు {యోగీశ్వ రేశ్వరుడు - మునిశ్రేష్ఠులకు ప్రభువు, విష్ణువు}; ఐన = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; ఆత్మన్ = మనసులను; రాముండు = సంతోషపెట్టువాడు; ఐ = అయ్యి; వారల = వారి; తోన్ = తోటి; రమించెన్ = కలిసెను; అప్పుడు = అప్పుడు.

భావము:

ఈవిధంగా పుష్పబాణుని బాణపరంపరలకు విహ్వలత్వం పొంది తట్టుకోలేక పోతున్న వ్రజ సుందరీమణులు పల్కిన దీనవచనాలు విని యోగేశ్వరేశ్వరుడూ ఆత్మారాముడూ అయిన శ్రీకృష్ణుడు నవ్వి వారితో రమించాడు. అప్పుడు. . .