పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల దీనాలాపములు

  •  
  •  
  •  

10.1-998-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దాలోకన హాస గీతజములై భాసిల్లు కామాగ్నులన్
దీయాధరపల్ల వామృతముచేఁ బాఁపం దగుం, బాఁపవే
ని వియోగానల హేతిసంహతులచే నీఱై, భవచ్చింతలన్
దంఘ్రిద్వయవీధిఁ బొందెదము నీ పాదంబులాన ప్రియా!

టీకా:

భవత్ = నీ యొక్క; ఆలోకన = చూపులనుండి; హాస = చిరునవ్వులనుండి; గీత = పాటలనుండి; జములు = పుట్టినవి; ఐ = అయ్యి; భాసిల్లు = ప్రకాశించెడి; కామాగ్నులన్ = మన్మథతాపములను; భవదీయ = నీ యొక్క; అధర = పెదవి అనెడి; పల్లవ = చిగురుల యొక్క; అమృతము = అమృతము; చేన్ = చేత; పాపన్ = అణచుట; తగున్ = సరియైనది; పాపవేని = అణచని ఎడల; వియోగ = విరహము అనెడి; అనల = అగ్ని; హేతి = మంటల; సంహతుల = సమూహముల; చేన్ = వలన; నీఱై = భస్మమైపోయి; భవత్ = నీమీది; చింతలన్ = విచారములతోనే; భవత్ = నీ యొక్క; అంఘ్రి = పాదములు; ద్వయ = రెంటి; వీధి = వైపునకే; పొందెదము = చేరెదము; నీ = నీ యొక్క; పాదంబులాన = పాదములమీద ఒట్టు; ప్రియా = ప్రియుడా.

భావము:

ఓ కృష్ణా! ప్రాణేశ్వరా! నీమీద ఒట్టేసి చెప్తున్నాము. నీ చూపులకి నవ్వులకి పాటలకి జనించి జ్వలించే మన్మథ తాపాలను నీ చిగురుమోవి సుధ చిందించి చల్లార్చు. చల్లార్చక పోతే ఈ విరహానల జ్వాలాలలో భస్మ మైపోయి, నిన్నే స్మరిస్తూ నీ అడుగుల జంట జాడనే చేరుతాము.