పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలకు నీతులు చెప్పుట

  •  
  •  
  •  

10.1-982-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ది యమునానదీజల సమేధిత పాదప పల్లవ ప్రసూ
ళవిరాజితం బగు వనంబు; మనంబుల మేర దప్పెనో?
పొదిఁగిట నేడ్చు బిడ్డలకుఁ బోయుఁడు పాలు; విడుండు లేఁగలన్
మొవులకున్; నిజేశ్వరుల ముద్దియలార! భజింపుఁ డొప్పుగన్.

టీకా:

ఇది = ఇది; యమునానదీ = యమునానది యొక్క; జల = నీటివలన; సమేధిత = చక్కగా పెరిగిన; పాదప = చెట్లు; పల్లవ = చిగుళ్ళు; ప్రసూన = పూలతో; దళ = ఆకులతో; విరాజితంబు = విలసిల్లెడిది; అగు = ఐన; వనంబు = అడవి; మనంబులన్ = చిత్తము లందు; మేరదప్పెనో = వైకల్యము కలిగెనా ఏమి; పొదిగిటన్ = చంకలో; ఏడ్చు = రోదిస్తున్న; బిడ్డలు = పిల్లల; కున్ = కు; పోయుడు = పట్టండి; పాలున్ = పాలను; విడుండు = వదలండి; లేగలన్ = దూడలను; మొదవులకున్ = పాడియావులకు; నిజ = మీ; ఈశ్వరులన్ = భర్తలను; ముద్దిలయలార = ఓ ముగ్ధలు; భజింపుడు = సేవించండి; ఒప్పుగన్ = చక్కగా.

భావము:

ఓ ముగ్ధలారా! ఇది కాళిందీ నదీజలాలతో చిగురించిన చిగుళ్ళతో, పూలతో, ఆకులతో పెరిగిన చెట్లు గల బృందావనం. మీ మనసులు హద్దులను మీరాయి. ఇక మందకు వెళ్ళిపొండి. ఏడుస్తున్న పిల్లలకు పాలివ్వండి; ఆవులకు దూడలను వదలండి; చక్కగా ప్రాణవల్లభులకు సపర్యలు చేయండి.