పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలకు నీతులు చెప్పుట

  •  
  •  
  •  

10.1-979-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లువడి సున్నఁజేసి, హృదయేశుల సిగ్గులు పుచ్చి, యత్తమా
నెరియించి, సోదరులమానము సూఱలు పుచ్చి, తల్లిదం
డ్రు రుచిమాన్చి, బంధులకు రోఁత యొనర్చుచు జారవాంఛలన్
నఱి సత్కులాంగనలు త్తురె? లోకులు సూచి మెత్తురే?

టీకా:

ఇలువడి = మంచినడత; సున్నజేసి = పోగొట్టుకొని; హృదయేశులన్ = భర్తలను; సిగ్గులు = లజ్జిలు; పుచ్చి = చితికిపోవు నట్లు చేసి; అత్త = భర్తతల్లిని; మామలన్ = భర్తతండ్రిని; ఎరియించి = తపింపజేసి; సోదరుల = తోడబుట్టువుల; మానమున్ = గౌరవమును; చూఱలుపుచ్చి = కొల్లగొట్టి; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల యొక్క; రుచిన్ = కాంతి; మాన్చి = పోగొట్టి; బంధుల్ = చుట్టముల; కున్ = కు; రోత = అసహ్యము; ఒనర్చుచుచు = కలుగజేయుచు; జార = విటుని యందలి; వాంఛలన్ = కోరికలతో; వలనఱి = విధముతప్పి; సత్కుల = మంచి వంశపు; అంగనలు = స్త్రీలు; వత్తురె = ఇలావత్తురా, రారు; లోకులు = ప్రజలు; చూచి = చూసి; మెత్తురే = మెచ్చుకొంటారా,మెచ్చరు.

భావము:

ఇంటిమర్యాద బుగ్గిలో కలిపి; భర్తలను సిగ్గుల పాలు చేసి; మామలకు పరితాపం కలిగించి; తోబుట్టువుల పరువుదీసి; తలితండ్రుల ఆశలు అడియాసలు చేసి; చుట్టాలకు రోత పుట్టిస్తూ; మంచికులంలో పుట్టినవారు పర పురుషుల మీది కోరికతో రాదగునా? చూసిన లోకులు మెచ్చుకుంటారా?