పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : శరద్రాత్రి గోపికలు జేరవచ్చుట

  •  
  •  
  •  

10.1-971-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జారుఁడని కాని కృష్ణుఁడు
భూరిపరబ్రహ్మ మనియు బుద్ధిఁ దలంపన్
నేరు; గుణమయదేహము
లే రీతిన్ విడిచి రింతు? లెఱిఁగింపు శుకా!”

టీకా:

జారుడు = విటుడు; అని = అని; కాని = తప్పించి; కృష్ణుడు = కృష్ణుడు; భూరి = అతిగొప్ప; పరబ్రహ్మము = పరమాత్మ; అనియున్ = అని; బుద్ధిన్ = మనసు నందు, తెలివితో; తలంపన్ = భావించుటకు; నేరరు = సమర్థులుకారు; గుణమయ = త్రిగుణవికారాత్మకమైన; దేహములు = శరీరములను; ఏరీతిన్ = ఏవిధముగా, ఎలా; విడిచితిరి = వదలిరి; ఇంతులు = స్త్రీలు; ఎఱిగింపు = తెలుపుము; శుకా = శుకమహర్షి.

భావము:

“ఓ శుకమహర్షీ! ఆ గోపికలు శ్రీకృష్ణుని కేవలం తమకు వన్నెకాని గానే భావించారు గానీ, గొప్ప పరబ్రహ్మ మని కాదు కదా. అలాంటి విషయాశక్తి గలవారు సత్త్వాది గుణమయా లైన కాయాలను ఎలా విడువగలిగారో నాకు తెలియజేయుము.”