పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కామధేనువు పొగడుట

  •  
  •  
  •  

10.1-950-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! మాకుం బరమదైవంబ; వింద్రుండవు; భూసుర గో సురసాధు సౌఖ్యంబుల కొఱకు నిన్నింద్రునిం జేసి పట్టంబు గట్టుమని విరించి నియమించి పుత్తెంచె నీవు భూతల భూరిభార నివారణంబు సేయ నవతరించిన హరి” వని పలికి; యంత.

టీకా:

దేవా = స్వామీ; మా = మా; కున్ = కు; పరమ = అత్యుత్కృష్టమైన; దైవంబవు = భగవంతుడవు; ఇంద్రుండవు = ప్రభువవు; భూసుర = బ్రాహ్మణుల; గో = ఆవుల; సుర = దేవతల; సాధు = సజ్జనుల; సౌఖ్యంబుల = శుభములు; కొఱకున్ = కోసము; నిన్నున్ = నిన్ను; ఇంద్రున్ = అధిపతివిగా; చేసి = చేసి; పట్టముగట్టుము = పట్టాభిషేకముచేయుము; అని = అని; విరించి = బ్రహ్మదేవుడు {విరించి - వివరముగా రచించువాడు, చతుర్ముఖబ్రహ్మ}; నియమించి = ఆఙ్ఞాపించి, చెప్పి; పుత్తెంచెన్ = పంపించెను; నీవు = నీవు; భూతల = భూమండలము నందలి; భూరి = అత్యధికమైన; భార = భారమును; నివారణంబు = పోగొట్టుట; చేయన్ = చేయుటకై; అవతరించిన = పుట్టినట్టి; హరివి = విష్ణుమూర్తివి; అని = అని; పలికి = విన్నవించుకొని; అంత = అంతట.

భావము:

దేవా! నీవు మాకు పరమదైవమవు. నీవే మాకు ప్రభువవు. బ్రాహ్మణులు, ధేనువులు, దేవతలు, సాధువులు యొక్క సుఖంకొరకు నీకు పట్టం గట్టమని బ్రహ్మదేవుడు మమ్ము నియమించి పంపాడు. నీవు ఈ సమస్త భూమండలం మహాభారాన్ని నివారించడానికి అవతరించిన ఆదినారాయణుడవు” అని కామధేనువు స్తుతించింది. పిమ్మట . . .