పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : దేవకి కృష్ణుని కనుట

  •  
  •  
  •  

10.1-113-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్నాముచేయఁగ రామిని
నానందరసాబ్ధిమగ్నుఁడై విప్రులకున్
ధేనువులం బదివేలను
మాసమున ధారవోసె ఱి యిచ్చుటకున్.

టీకా:

స్నానము = స్నానము, నీళ్ళుపోసుకొనుట; చేయగరామిని = చేయలేకపోవుటచేత; ఆనంద = ఆనందమనెడి; రస = రసమునందు; మగ్నుడు = మునిగినవాడు; ఐ = అయ్యి; విప్రుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; ధేనువులన్ = గోవులను; పదివేలను = పదివేలింటిని (10,000); మానసమునన్ = మనసునందు; ధారపోసెన్ = ధారాదత్తముచేసెను; మఱి = మరి; ఇచ్చుట = దానముచేయుట; కున్ = కు.

భావము:

స్నానం చేయడం వీలుకాకపోవుట చేత ఆనంద రసమనే సముద్రంలో మునిగి తేలుతున్న వసుదేవుడు బ్రాహ్మణులకు "పదివేల ఆవులు దానం చేస్తున్నాను" అని మానసికంగా ధారపోసాడు.