పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : దేవకి కృష్ణుని కనుట

  •  
  •  
  •  

10.1-106-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వచ్ఛంబులై పొంగె లరాసు లేడును-
లఘోషణముల మేఘంబు లుఱిమె;
గ్రహతారకలతోడ గనంబు రాజిల్లె-
దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ;
మ్మని చల్లని గాలి మెల్లన వీఁచె-
హోమానలంబు చెన్నొంది వెలిఁగెఁ;
గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ-
బ్రవిమలతోయలై పాఱె నదులు;

10.1-106.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర పుర గ్రామ ఘోష యై సుధ యొప్పె;
విహగ రుత పుష్ప ఫలముల వెలసె వనము;
లరుసోనలు గురిసి ర య్యమరవరులు;
దేవదేవుని దేవకీదేవి గనఁగ.

టీకా:

స్వచ్ఛంబులు = నిర్మలములు; ఐ = అయ్యి; పొంగె = పోటెత్తినవి; జలరాసులేడును = సప్తసముద్రములు {సప్తసముద్రములు - 1లవణ 2ఇక్షు 3సురా 4సర్పి 5దథి 6క్షీర 7జల సముద్రములు ఏడు}; కల = అవ్యక్తమథురమైన; ఘోషణముల = మేఘధ్వనులతో; మేఘంబులున్ = మేఘములు; ఉఱిమెన్ = ఉఱిమినవి; గ్రహ = బుధాది గ్రహములతోటి; తారకల = అశ్వినాది చుక్కల; తోడన్ = తోటి; గగనంబున్ = ఆకాశము; రాజిల్లెన్ = ప్రకాశించెను; దిక్కులు = అష్టదిక్కులు; మిక్కిలి = అధికముగా; తెలివిన్ = తేటదనములను; తాల్చెన్ = ధరించెను; కమ్మని = సువాసనలు కల; చల్లని = చల్లగానున్న; గాలి = వాయువులు; మెల్లనన్ = మెత్తగా; వీచెన్ = వీచినవి; హోమానలంబున్ = హోమాగ్ని; చెన్నొంది = కాంతివంతమై; వెలిగెన్ = ప్రకాశించెను; కొలకులు = సరోవరములు; కమల = పద్మముల; అళి = తుమ్మెదల; కులములు = సమూహములుకలవి; ఐ = అయ్యి; సిరిన్ = కాంతిచేత; ఒప్పెన్ = చక్కగానుండెను; ప్ర = మిక్కిలి; విమల = నిర్మలములైన; తోయంబులు = నీరు కలవి; ఐ = అయ్యి; పాఱెన్ = ప్రవహించెను; నదులు = ఏరులు.
వర = శ్రేష్ఠములైన; పుర = పట్టణములు; గ్రామ = గ్రామములు; ఘోషన్ = గొల్లపల్లెలుగలది; ఐ = అయ్యి; వసుధ = భూమండలము; ఒప్పెన్ = అందగించెను; విహగ = పక్షుల; రుత = కూతలతో; పుష్ప = పూలతో; ఫలముల = పండ్లతో; వెలసెను = విలసిల్లెను; వనములున్ = తోటలు; అలరు = పూల; సోనలు = జల్లులు; కురిసిరి = వర్షించిరి; ఆ = ఆ; అమర = దేవతా; వరులు = శ్రేష్ఠులు; దేవదేవుని = విష్ణుమూర్తిని; దేవకీ = దేవకి అనెడి {దేవదేవుడు - బ్రహ్మేంద్రాది దేవతలందరకు దేవుడైనవాడు, విష్ణువు}; దేవి = ఉత్తమురాలు; కనగ = ప్రసవించునప్పుడు.

భావము:

దేవకీదేవి శ్రీకృష్ణభగవానుని ప్రసవిస్తున్నట్టి ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఉరుముల చాటింపు వేసాయి. ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది. దిక్కులన్ని దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమగుండాలలోని అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తుమ్మెదలతో కూడిన పద్మాల గుంపులతో సరోవరాలు కళకళ లాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. శ్రేష్ఠమైన నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలుతో భూదేవి వెలిగి పోయింది. పక్షుల కిలకిలారావాలతో, పూలతో పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు విలసిల్లాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు.