పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఇంద్రుడు పొగడుట

  •  
  •  
  •  

10.1-941-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కొక లోకముఁ గాచుచు
నెక్కుడు గర్వమున "నేమె యీశుల" మనుచుం
జొక్కి ననుబోటి వెఱ్ఱులు
నిక్కము నీ మహిమ దెలియనేర రనంతా!

టీకా:

ఒక్కొక్క = ఒకటి చొప్పున మాత్రమే; లోకమున్ = లోకములు {చతుర్దశభువనములు - సప్త ఊర్ధ్వలోకములు (1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము 4మహర్లోకము 5జనలోకము 6తపోలోకము 7సత్యలోకము) సప్త అధోలోకములు (1అతలము 2వితలము 3సుతలము 4రసాతలము 5మహాతలము 6తలాతలము 7పాతాళము) అను పద్నాలుగు లోకములు}; కాచుచున్ = పాలించుచు; ఎక్కుడు = అధికమైన; గర్వమునన్ = మదముతో; ఏమె = మేమే; ఈశులము = సర్వనియామకులము; అనుచున్ = అని; చొక్కి = మత్తుగొని; నను = నన్ను; బోటి = పోలిన; వెఱ్ఱులు = మూఢులు; నిక్కమున్ = నిజముగా; నీ = నీ యొక్క; మహిమన్ = మహత్వమును; తెలియనేరరు = తెలిసికొనజాలరు; అనంతా = కృష్ణా {అనంతడు - అంతములేని వాడు, విష్ణువు}.

భావము:

అనంతా! కృష్షా! ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క లోకాన్ని పాలిస్తూ, ఎంతో ఎక్కువ గర్వంతో నిక్కి నీల్గి, నిఖిలమునకు మేమే ప్రభువులం అంటూ ఒడలు మరచి వర్తించే నా వంటి వెఱ్ఱివాళ్ళు నిజంగా నీ ప్రభావం గుర్తించ లేరు.