పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోవర్ధనగిరి నెత్తుట

  •  
  •  
  •  

10.1-927-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఉడిగెను వానయు గాలియు
డిచెడి నదులెల్లఁ బొలుప ఱద లిగిరెఁ; గొం
డుగున నుండక వెడలుఁడు
కొడుకులుఁ గోడండ్రు సతులు గోవులు మీరున్. "

టీకా:

ఉడిగెను = వదిలినది; వానయున్ = వర్షము; గాలియు = గాలి; వడి = ప్రవాహతీవ్రత; చెడి = తగ్గిపోయి; నదులు = నదులు; ఎల్లన్ = అన్నిటి యందు; పొలుపన్ = చక్కన కాగా; వఱదలు = పొంగిపొర్లిపోవుటలు; ఇగిరెన్ = ఇంకిపోయినవి; కొండ = పర్వతము; అడుగునన్ = కింద; ఉండకన్ = ఉండకుండా; వెడలుడు = బయటకురండి; కొడుకులు = పుత్రులు; కోడండ్రున్ = కోడళ్ళు; సతులు = స్త్రీలు; గోవులున్ = పశువులు; మీరున్ = మీరు.

భావము:

“వాన వెలసిపోయింది; గాలి నిలచిపోయింది; నదుల ఉరవడి తగ్గింది; వరదలు ఆగిపోయాయి; కొండ అడుగున ఇక ఉండకండి; మీ కొడుకులతో, కోడళ్ళతో, కులకాంతలతో, గోవులతో బయటకు వచ్చేయండి.”