పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోవర్ధనగిరి నెత్తుట

  •  
  •  
  •  

10.1-922-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పలుకుచున్న హరిపలుకులు విని నెమ్మనమ్ముల నమ్మి కొండ యడుగున తమతమ యిమ్ములం బుత్ర మిత్ర కళత్రాది సమేతులై గోవులుం దారును గోపజనులు జనార్దన కరుణావలోక నామృతవర్షంబున నాఁకలి దప్పుల చొప్పెఱుంగక కృష్ణకథా వినోదంబుల నుండి; రివ్విధంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = చెప్పుతున్న; హరి = కృష్ణుని; పలుకులు = మాటలు; విని = విని; నెఱ = నిండు; మనమ్ములన్ = మనసులతో; నమ్మి = విశ్వసించి; కొండ = పర్వతము; అడుగున = కింద; తమతమ = వారవారి; ఇమ్ములన్ = నచ్చిన చోటు లందు; పుత్ర = పిల్లలు; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్యలు; ఆది = మున్నగువారితో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; గోవులున్ = పశువులు; తారును = తాము; గోపజనులు = గొల్లవారు; జనార్దన = కృష్ణుని; కరుణా = దయతోడి; అవలోకన = చూపు లనెడి; అమృత = అమృతపు; వర్షంబునన్ = వానచేత; ఆకలి = ఆకలి; దప్పులన్ = దాహముల; చొప్పు = విధము, జాడ; ఎఱుంగక = తెలియకుండగ; కృష్ణ = కృష్ణుని యొక్క; కథా = కథలు చెప్పుకొనెడి; వినోదంబులన్ = వేడుక లందు; ఉండిరి = ఉన్నారు; ఈ = ఈ; విధంబున = విధముగ.

భావము:

ఇలా నమ్మకంగా చెప్తున్న కృష్ణుడి మాటలు గోపకులు మనస్ఫూర్తిగా విశ్వసించారు. వారు తమ పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైనవారి తోనూ ధేనువుల తోనూ అతని కరుణాకటాక్ష వీక్షణామృత వర్షంలో ఆకలిదప్పులు లేకుండా, కృష్ణుడి కథలు వేడుకగా చెప్పుకుంటూ వింటూ ఆ కొండ క్రింద తమ తమ స్థానాలలో ఉండిపోయారు.