పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోవర్ధనగిరి నెత్తుట

  •  
  •  
  •  

10.1-920-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రా ల్లి! రమ్ము తండ్రీ!
వ్రేలు గోపకులు రండు; వినుఁ; డీ గర్త
క్ష్మాలమున నుండుఁడు గో
వ్రాముతో మీరు మీకు లసిన యెడలన్.

టీకా:

రా = రండి; తల్లి = అమ్మలు; రమ్ము = రండి; తండ్రీ = నాయనలు; వ్రేతలు = గోపికలు; గోపకులు = యాదవు పురుషులు; రండు = రండి; వినుడు = వినండి; ఈ = ఈ యొక్క; గర్త = కొండను పెల్లగించిన; క్ష్మాతలమునన్ = ప్రదేశమునందు; ఉండుడు = ఉండండి; గో = పశువుల; వ్రాతము = సమూహముల; తోన్ = తోటి; మీరు = మీరు; మీ = మీరల; కున్ = కు; వలసిన = కావలసినట్టి; ఎడలన్ = చోటు లందు.

భావము:

“ఓ యమ్మా! రా; రా నాయనా! గోపవనితలారా! గోపకులారా! రండి రండి; నా మాట వినండి. వచ్చి మీకు నచ్చిన చోట గోవుల మందలతో సహా ఈ కొండ క్రింద నిలవండి.