పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పాషాణ సలిల వర్షంబు

  •  
  •  
  •  

10.1-911-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేత లందఱు నన్నునె
సేవింతురు; రాజ్యమదముఁ జెందరు; చెఱుపం
గా లదు; మానభంగముఁ
గావింపఁగ వలయు శాంతి లిగెడుకొఱకై."

టీకా:

దేవతలు = దేవతలు; అందఱున్ = ఎల్లరు; నన్నునె = నన్ను మాత్రమే; సేవింతురు = కొలచెదరు; రాజ్య = పాలనాధికారము వలని; మదమున్ = గర్వమును; చెందరు = పొందరు; చెఱుపంగా = నశింపజేయుట; వలదు = అక్కరలేదు; మాన = గర్వమును; భంగము = అణచివేయుట; కావింపగవలయున్ = చేయవలెను; శాంతి = శాంతి; కలిగెడు = నెలకొనుట; కొఱకు = కోసము; ఐ = అయ్యి.

భావము:

దేవతలు అందరూ నన్ను భక్తితో కొలుస్తారు. వారికి రాజ్యమదం లేదు. కనుక, వారికి చెరుపు చేయరాదు. వారి అహంకారం అణగిపోయేటట్లు, వారికి గర్వభంగం చెయ్యాలి.