పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పాషాణ సలిల వర్షంబు

  •  
  •  
  •  

10.1-910-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నొక యింతగైకొనరు; ప్పిరి; యాగము చేసి రంచుఁ దా
మిన్నుననుండి గోపకులమీఁద శిలల్ గురియించుచున్న వాఁ
డున్నత నిర్జరేంద్ర విభవోద్ధతి గర్వనగాధిరూఢుడై
న్నులఁ గానఁ డింద్రుఁ డిటు; ర్వపరుం డొరుఁ గాన నేర్చునే?

టీకా:

తన్ను = అతనిని; ఇంతన్ = కొంచెముకూడ; కైకొనరు = లక్ష్యపెట్టరు; తప్పిరి = వాడుక తప్పించిరి; యాగము = యాగము; చేసిరి = చేసితిరి; అంచున్ = అని; తాన్ = అతను; మిన్నునన్ = ఆకాశము నందు; ఉండి = ఉండి; గోపకుల = గొల్లవారి; మీదన్ = పైన; శిలల్ = రాళ్ళను; కురియించుచున్ = వర్షించుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఉన్నత = ఉన్నతమైన; నిర్జరేంద్ర = దేవేంద్ర పదవీ; విభవ = వైభవము అనే; ఉద్ధతి = గొప్పదనంతో కలిగిన; గర్వ = గర్వము అనెడి; నగ = పర్వతము; అధిరూఢుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; కన్నుల గానడు = కళ్ళు కనిపించుట లేదు; ఇంద్రుడు = ఇంద్రుడు; ఇటు = ఈ విధముగ; గర్వపరుండు = గర్వించినవాడు; ఒరున్ = ఇతరులను; కానన్ = చూడ; నేర్చునే = నేర్చునా, నేరడు.

భావము:

ఉన్నతమైన అమరాధిపత్యం అందిందని దేవేంద్రుడు పర్వతం అంత గర్వం ఎక్కి ఉన్నాడు. ఇలాంటి కన్నులు కనిపించని అహంకారం గలవాడు ఇతరులను ఎలా కనగలడు. గోపకులు తన్ను తృణీకరించి ఇంద్రయాగం చేయడం మానివేశారని ఆకాశం నుండి ఇలా శిలావర్షం కురిపిస్తున్నాడు.