పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పాషాణ సలిల వర్షంబు

  •  
  •  
  •  

10.1-908-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారి బరు వయ్యె మందల
వారికి; నిదె పరులు లేరు వారింపంగా;
వారిద పటల భయంబును
వారిరుహదళాక్ష! నేడు వారింపఁగదే. "

టీకా:

వారి = నీరు; బరువయ్యెన్ = భరింపరానిదైపోయెను; మందలన్ = గొల్లపల్లెలలో ఉండెడి; వారి = వారల; కిన్ = కి; ఇదె = ఇదిగో; పరులు = ఇతరులు ఎవరును; లేరు = లేరు; వారింపంగా = తొలగించుటకు; వారిద = మేఘముల; పటల = సమూహములవలని; భయంబును = భయమును; వారిరుహదళాక్షా = కృష్ణా {వారిరుహ దళాక్షుడు - వారిరుహ (పద్మముల) దళా (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; నేడు = ఇప్పుడు; వారింపగదే = పోగొట్టుము.

భావము:

ఓ నీరజనయనా! కృష్ణా! గోపకులకు ఈ వర్షం నీరు దుర్భరంగా ఉందయ్యా. ఈ బాధ నివారించే వారు నీవు తప్ప మరెవరున్నారు. మేఘాల గుంపుల వలన కలిగిన భీతిని తొలగించు."