పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పర్వత భంజనంబు

  •  
  •  
  •  

10.1-894-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గోపకులు హరిసమేతులై గిరికిం బూజనోపహారంబులు సమర్పించి, గోధనంబులం బురస్కరించుకొని భూసురాశీర్వాద వచనంబులతో గిరికిం బ్రదక్షిణంబు చేసి, రా సమయంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; గోపకులు = యాదవులు; హరి = కృష్ణునితో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; గిరి = కొండ; కిన్ = కు; పూజన = పూజించుట; ఉపహారంబులు = నైవేద్యములు; సమర్పించి = నివేదించి; గో = గోవులు అనెడి; ధనంబులన్ = సంపదలను; పురస్కరించుకొని = ముందుంచుకొని; భూసుర = విప్రుల; ఆశీర్వచన = దీవెనల; వచనంబుల = పలుకుల; తోన్ = తోటి; గిరి = కొండ; కిన్ = కు; ప్రదక్షిణంబు = ప్రదక్షిణలు {ప్రదక్షిణ - రూపమునకు చుట్టును కుడివైపుగా భక్తితో తిరుగుట}; చేసిరి = చేసిరి; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయము నందు.

భావము:

ఇలా, గోపాలకులు శ్రీ హరితో కూడి ఆ కొండకు పూజలూ కానుకలూ సమర్పించారు. పిమ్మట ఆలమందలను ముందుంచుకొని బ్రాహ్మణాశీస్సులతో ఆ గిరికి అందరూ ప్రదక్షిణలు చేశారు.