పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : విప్రవనితా దత్తాన్న భోజనంబు

  •  
  •  
  •  

10.1-865-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారిత సర్వస్పృహలై
వా రందఱుఁ దన్నుఁ జూడ చ్చుట మదిలో
వారిజనయనుఁడు పొడగని
వారికి నిట్లనియె నగి యవారితదృష్టిన్.

టీకా:

వారిత = తొలగిన; సర్వ = సమస్తమైన; స్పృహలు = ఇచ్చలు కలవారు; ఐ = అయ్యి; వారు = వారు; అందఱున్ = అందరు; తన్నున్ = తనను; చూడన్ = దర్శించుటకు; వచ్చుటన్ = వచ్చుటను; మది = మనసు; లోన్ = అందు; వారిజనయనుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; పొడగని = చూసి; వారి = వారల; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నగి = నవ్వి; అవారిత = అడ్డులేని; దృష్టిన్ = దృష్టితో.

భావము:

ఆ విప్రవనితలు అన్ని అపేక్షలు వదులుకుని తన్ను దర్శించే తహతహతో రావడం సర్వదర్శనుడైన ఆ పద్మాక్షుడు కృష్ణుడు గ్రహించి ఒక చిరునవ్వు నవ్వి వారి వైపు చూస్తూ ఇలా అన్నాడు.