పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : విప్రవనితా దత్తాన్న భోజనంబు

  •  
  •  
  •  

10.1-861-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చని యమునాసమీపంబున నవపల్లవాతిరేకంబును విగత వనచర శోకంబును నైన యశోకంబుక్రింద నిర్మలస్థలంబున.

టీకా:

చని = వెళ్ళి; యమునా = యమునానదీ; సమీపంబునన్ = వద్ద; నవ = కొత్త; పల్లవ = చిగుళ్ళచేత; అతిరేకంబును = అతిశయించినది; విగత = పోయిన; వన = అడవి యందు; చర = తిరుగువారి; శోకంబును = శోకములు కలది; ఐన = అయిన; అశోకంబు = అశోకవృక్షము; క్రింద = కింద; నిర్మల = పరిశుభ్రమైన; స్థలంబునన్ = చోటునందు.

భావము:

అలా వారు వెళ్ళి యమునానది వద్ద వనాలలో తిరిగే వారి క్లేశాలు హరించేది, నవనవలాడే చిగురులతో ఇంపారు తున్నది అయిన అశోక చెట్టు క్రింద నిర్మలప్రదేశంలో ఉన్న కృష్ణుడిని చూసారు. . .