పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : విప్రవనితా దత్తాన్న భోజనంబు

  •  
  •  
  •  

10.1-860-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బిడ్డలు మగలును భ్రాతలు
డ్డము చని వల దనంగ టు తలఁడని మా
ఱొడ్డుచు జగదీశ్వరునకు
డ్డన నన్నంబు గొనుచుఁ ని రా సుదతుల్.

టీకా:

బిడ్డలు = పుత్రులు; మగలును = భర్తలు; భ్రాతలు = సోదరులు; అడ్డము = అడ్డముగా; చని = వెళ్ళి; వలదు = వద్దు; అనంగన్ = అని చెప్పగా; అటు = అవతలకి; తలడు = తొలగుడు; అని = అని చెప్పి; మాఱొడ్డుచున్ = ఎదిరించి పలుకుతు; జగదీశ్వరున్ = కృష్ణుని {జగదీశ్వరుడు – ఎల్ల లోకములకు ఈశ్వరుడు, విష్ణువు}; కున్ = కి; జడ్డనన్ = శీఘ్రముగ; అన్నంబున్ = భోజన పదార్థములు; కొనుచున్ = తీసుకొని; చనిరి = వెళ్ళిరి; ఆ = ఆ యొక్క; సుదతుల్ = స్త్రీలు {సుదతి - మంచి దంతములు కలామె, స్త్రీ}.

భావము:

బిడ్డలు, పతులు, తోబుట్టువులు అడ్డంవచ్చి వద్దని వారిస్తున్నా, ఆ బ్రాహ్మణ స్త్రీలు “మమ్మల్ని అడ్డగించకండి తప్పుకోండి” అని బదులు చెబుతూ జగన్నాథునికి అన్నం తీసుకుని వెళ్ళారు.