పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల యెడ ప్రసన్ను డగుట

  •  
  •  
  •  

10.1-854-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీక్షితునకు నైనం
నుఁ గుడువఁగఁ; బశువధంబు సౌత్రామణియుం
నిన వెనుక దోషము లే
ఘాత్మకులార! పెట్టు న్నము మాకున్. "

టీకా:

ఘన = గొప్పవారైన; దీక్షితున్ = దీక్షితుని, దీక్షవహించినవాని {దీక్షితుడు - సోమముగల యజ్ఞమునందు దీక్ష వహించువాడు}; కున్ = కి; ఐనన్ = అయినను; చనున్ = తగును; కుడువంగన్ = భుజించుట; పశు = యాగపశువు; వధంబున్ = బలిచ్చుట; సౌత్రామణియున్ = ఇంద్రహోమము {సౌత్రామణి - సుత్రాముడైన ఇంద్రుని సంబంధమైన హోమము}; చనిన = అయిన; వెనుక = పిమ్మట; దోషము = తప్పు; లేదు = లేదు; అనఘాత్ములారా = ఓ పుణ్యాత్ములు {అనఘాత్ములు -అఘము (పాపము) లేని మనసు గల వారు, పుణ్యాత్ములు}; పెట్టుడు = పెట్టండి, ఇవ్వండి; అన్నము = ఆహారము; మా = మా; కున్ = కు.

భావము:

యాగం నడుస్తూ ఉండగా పశువధము, సౌత్రామణి కార్యక్రమములు జరిగిన పిమ్మట దీక్షలో ఉన్న గొప్పవాడు సైతము అన్నము తిన వచ్చును. ఇందు దోషములేదు కదా! మహానుభావులారా! యాగం నడుస్తోంది ఆగండి అనకుండా, మాకు అన్నము పెట్టండి.