పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మాదుల స్తుతి

  •  
  •  
  •  

10.1-94-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱిఁగినవారల మనుచును
గొమాలిన యెఱుక లెఱిఁగి కొందఱు నీ పే
రెఱిగియు దలఁపగ నొల్లరు
తు రధోగతుల జాడఁ ద్మదళాక్షా!

టీకా:

ఎఱిగిన = తత్త్వము తెలిసిన; వారలము = వారము; అనుచున్ = అనుచు; కొఱమాలిన = పనికిమాలిన; ఎఱుకలు = ఙ్ఞానములు; ఎఱిగి = తెలిసికొని; కొందఱు = కొంతమంది; నీ = నీ యొక్క; పేరు = గొప్పదనము, నామము; ఎఱిగియున్ = తెలిసినప్పటికిని; తలపగన్ = మననము చేయుటకు; ఒల్లరు = అంగీకరింపరు; పఱతురు = పడిపోయెదరు; అథోగతుల = నీచ జన్మముల; జాడన్ = మార్గము నందు; పద్మదళాక్ష = విష్ణుమూర్తి {పద్మదళాక్షుడు - తామర రేకుల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}.

భావము:

హరీ! కొందరు జ్ఞానులము అనుకుంటూ దుష్టులై పనికిమాలిన తెలివి తేటలతో నీ నామసంకీర్తన చేయరు. నీ నామసంకీర్తనం నిజంగా జ్ఞానులైన వారిని రక్షిస్తుంది అని తెలిసినా నీ నామం మననం చేయకుండా పోయి పోయి అధోగతుల పాలవుతారు.