పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శౌనకాదుల ప్రశ్నంబు

  •  
  •  
  •  

1-53-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చారుతర ధర్మరాశికి
భాకుఁడగు కృష్ణుఁ డాత్మదమున కేఁగన్,
భాకుఁడు లేక యెవ్వనిఁ
జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా!

టీకా:

చారుతర = అతి మనోహరమైన {చారు - చారుతర - చారుతమ}; ధర్మ = ధర్మముల; రాశి = సమూహము; కిన్ = నకు; భారకుఁడు = భరించు వాడు; అగు = అయినటువంటి; కృష్ణుఁడు = కృష్ణుడు; ఆత్మ = తన; పదమునకు = లోకమునకు; ఏఁగన్ = వెళ్ళగా; భారకుఁడు = భర్త; లేక = లేకపోవుటచే; ఎవ్వనిన్ = ఎవనిని; చేరును = చేరును; ధర్మంబు = ధర్మము; బలుపు = పుష్టిని; సెడి = కోల్పోయి; ముని = ముని అయిన; నాథా = ప్రభువా.

భావము:

ఓ సూతమహర్షీ! ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తరువాత, ఆధారంలేని ధర్మం దిక్కుమాలి, చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు.”