పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నైమిశారణ్య వర్ణనము

  •  
  •  
  •  

1-38-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుణ్యంబై, మునివల్లభ
ణ్యంబై, కుసుమ ఫల నికాయోత్థిత సా
ద్గుణ్యమయి, నైమిశాఖ్యా
ణ్యంబు నుతింపఁ దగు నణ్యంబులలోన్.
^^నైమిశారణ్యం వర్ణనలోని పదాలు - రెండేసి అర్థాలు
^^నైమిశారణ్యం వర్ణనలోని జీవాల గణన

టీకా:

పుణ్యంబు = పుణ్య ప్రదేశము; ఐ = అయి; ముని = మునులలో; వల్లభ = శ్రేష్ఠులచే; గణ్యంబు = గొప్పదిగా గణింప బడునది; ఐ = అయి; కుసుమ = పుష్పాల; ఫల = ఫలాలను; నికాయ = సమూహముల వలన; ఉత్థిత = ఉద్భవించిన; సాద్గుణ్యము = మంచి గుణాలు కలిగినది; అయి = అయి; నైమిశ = నైమిశమను; ఆఖ్య = పేరుగల; అరణ్యంబు = అరణ్యము; నుతింపన్ = పొగడుటకు; తగున్ = తగును; అరణ్యంబుల = అరణ్యా లన్నిటి; లోన్ = లోను.

భావము:

పుష్పములు, ఫలములతో నిండిన నైమిశారణ్యం అరణ్యాలలోకెల్లా గొప్పదై అలరారుతుంటుంది. ఈ పుణ్యప్రదేశం తాపసోత్తములచే శ్రేష్ఠమైనదని కీర్తింపబడుతుంటుంది,