పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

  •  
  •  
  •  

1-464-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని మనుజేశ్వరుండు మృగయాపరిఖేదనితాంతదాహసం
నిత దురంతరోషమున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ
ములుసేయఁడంచు మృతర్పమునొక్కటి వింటికోపునం
నివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్.

టీకా:

అని = అని; మనుజేశ్వరుండు = రాజు, పరీక్షిత్తు {మనుజేశ్వరుడు - మానవులకు ప్రభువు, రాజు}; మృగయా = వేట వలన కలిగిన; పరిఖేద = బాధతో - అలసటతో; నితాంత = అధికమైన; దాహ = దాహము వలన; సంజనిత = పుట్టుచున్న; దురంత = అంతులేని; రోషమున = రోషముతో; సంయమి = సంయమనము కలవాడు, తపస్వి; తన్నున్ = తనను; తిరస్కరించి = లెక్కచేయక; పూజనములు = మర్యాదలు; సేయఁడు = చేయడు; అంచున్ = అనుచును; మృత = మరణించిన; సర్పమున్ = పామును; ఒక్కటి = ఒకటి; వింటి = విల్లు యొక్క; కోపునన్ = కొప్పున - చివరతో - బాణముతో; పనివడి = పనిగట్టుకొని; తెచ్చి = తీసుకొనివచ్చి; వైచెన్ = వేసెను; అటు = అటు; బ్రహ్మ = బ్రహ్మ; మునీంద్రుని = ఋషి యొక్క; అంసవేదికన్ = గూడలందలి సమ స్థలములో, మెడలో.

భావము:

అలా అనుకుని పరీక్షిత్తు వేటలో కలిగిన అలసట, అధికమైన దాహములతో జనించిన దురంత రోషముతో ముని తనను లెక్కచేయటంలేదు, గౌరవించుట లేదు అంటూ, వింటి కొప్పుతో ఒక చచ్చిన పామును పనికట్టుకొని తీసుకొచ్చి ఆ బ్రహ్మర్షి భుజాన పడవేశాడు.