పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-436-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""జదీశ్వర! నీ యడిదము
ధగితప్రభలతోడఁ ఱచుగ మెఱయన్
బెడెం జిత్తము గుండెలు
గిలెడి నిఁక నెందుఁ జొత్తు భావింపఁ గదే.

టీకా:

జగత్ = జగత్తునకు; ఈశ్వర = అధిపతీ; నీ = నీ యొక్క; అడిదము = ఖడ్గము; ధగధగిత = ధగధగలాడుతున్న; ప్రభల = కాంతుల; తోడన్ = తో; తఱచుగ = ఎక్కువగ; మెఱయున్ = మెరుయును; బెగడెన్ = భయపడిపోయెను; చిత్తము = మానసము; గుండెలు = గుండెలు; వగిలెడిన్ = పగిలి పోవు చున్నవి; ఇంకన్ = ఇంక; ఎందున్ = ఎందులో; చొత్తు = చొరబడను, దూరను; భావింపఁ గదే = ఆలోచింపుము.

భావము:

“జగత్పతీ! ధగద్ధగిత కాంతులతో మెరుస్తున్న నీ కరకు కరవాలాన్ని చూసి నా గుండెలు పగులుతున్నాయి. నా హృదయం బెదురుతున్నది. ఇప్పుడు నే నెక్కడికి పోయేది. ఎక్కడ ఉండేది నీవే ఆలోచించు.