పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-424-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాధువులగు జంతువులకు
బాలు గావించు ఖలుల భంజింపని రా
జాము నాయుస్స్వర్గ
శ్రీనములు వీటిఁబోవు సిద్ధము తల్లీ!

టీకా:

సాధువులు = అహింసా మార్గలము; అగు = అయినట్టి; జంతువుల = ప్రాణుల; కున్ = కు; బాధలున్ = బాధలు; కావించు = కలుగజేయు, పెట్టు; ఖలుల = దుష్టులను; భంజింపని = భంజకము చేయని, ఖండించని; రాజ = రాజులలో; అధముని = అధముని, నీచుని; ఆయుస్ = ఆయుష్షు; స్వర్గ = స్వర్గసుఖములు; శ్రీ = సిరి, శోభ; ధనములు = విత్తములు; వీటిఁబోవున్ = వ్యర్థమగుట; సిద్ధము = సిద్ధించును, తప్పదు; తల్లీ = తల్లీ.

భావము:

సాధులయిన జీవులను బాధించే దుర్మార్గులను రాజైనవాడు అవశ్యం శిక్షించాలి. అలా శిక్షించకుండా ఉపేక్షించిన రాజాధముని జీవితమూ, ఆయుస్సూ, ఐశ్వర్యమూ, సర్వం వ్యర్థం. ఈ మాట ముమ్మూటికీ యథార్థం తల్లీ!