పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-405-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేతలకు, ఋషులకుఁ, బితృ
దేతలకు, నాకు, నీకు, ధీరులకును, నా
నార్ణాశ్రమములకును
గోవులకును బాధ యనుచుఁ గుందెద ననఘా!

టీకా:

దేవతలు = దేవతలు; కున్ = కు; ఋషులు = ఋషులు; కున్ = కును; పితృదేవతలు = వంశపురుషులు; కున్ = కు; నాకు = నాకు; ధీరులు = ధైర్యము కలవారల; కున్ = కును; నానా = అన్ని; వర్ణ = వర్ణములకు {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమముల = ఆశ్రమముల {చాతురాశ్రమములు - బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్యాస.}; కును = కును; గోవుల = ఆవుల; కును = కును; బాధ = బాధ; అనుచున్ = అనుచు; కుందెదన్ = దుఃఖపడెదను; అనఘా = పాపములేనివాడా.

భావము:

ఓ పుణ్యపూర్తీ దేవతలకూ, పితృదేవతలకూ, ఋషులకూ, నాకూ, నీకూ, నానావిధాలైన వర్ణాశ్రమాలకూ, గోవులకూ, మహానుభావులకూ బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను.