పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-404-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాతీతము లగు స
ద్గుములు గల చక్రి సనిన ఘోరకలిప్రే
మునఁ బాప సమూహ
వ్ర యుతు లగు జనులఁ జూచి గచెదఁ దండ్రీ!

టీకా:

గణన = లెక్కించుటకు, ఎంచుటకు; అతీతములు = మిక్కిలినవి, వీలుకానివి; అగు = అయినట్టి; సత్ = మంచి; గుణములు = లక్షణములు; కల = కలిగిన; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; చనినన్ = చనిన తరువాత; ఘోర = భయంకరమైన; కలి = కలిచేత; ప్రేరణమునన్ = ప్రేరేపించుట వలన, ఉసిగొల్పుట వలన; పాప = పాపముల; సమూహ = సమూహములు అను; వ్రణ = కురుపులు, పుండ్లు; యుతులు = కలిగినవారు; అగు = అయినట్టి; జనులన్ = ప్రజలను; చూచి = చూసి; వగచెదన్ = చింతించెదను; తండ్రీ = తండ్రీ.

భావము:

ఓ తండ్రీ! ఈ విధంగా లెక్కించటానికి శక్యంకాని సద్గుణాల రాశి చక్రధరుడు అవతారం చాలించగానే, కలుషాత్ముడైన కలిపురుషునిచే ఉసిగొల్పబడిన భయంకర పాపకృత్యాలు అనే పుండ్లతో కూడిన ప్రజాసమూహాన్ని చూడగానే నాకు దుఃఖం పొంగి వస్తున్నది.