పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : యాదవుల కుశలం బడుగుట

  •  
  •  
  •  

1-355-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డితివో శత్రువులకు,
నాడితివో సాధు దూషణాలాపములం;
గూడితివో పరసతులను,
వీడితివో మానధనము వీరుల నడుమన్;

టీకా:

ఓడితివో = ఓడిపోయావా ఏమిటి; శత్రువుల = పగవారి; కున్ = కి; ఆడితివో = పలికితివా ఏమిటి; సాధు = మంచివారిని; దూషణ = దూషించు; ఆలాపములన్ = మాటలతో; కూడితివో = కలిసితివా ఏమిటి; పర = ఇతరుల; సతులను = భార్యలను; వీడితివో = విడిచితివా ఏమిటి; మాన = మానము అను; ధనము = సంపదను; వీరుల = వీరుల; నడుమన్ = మధ్యన.

భావము:

పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా? సజ్జనులను తూలనాడలేదు కదా? పరాంగనలను కూడలేదు కదా? అరివీరుల నడుమ అభిమానాన్ని వీడలేదు కదా?