పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : యాదవుల కుశలం బడుగుట

  •  
  •  
  •  

1-353-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో,
న్నాహంబునఁ గాలకేయుల ననిం క్కాడుచోఁ, బ్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ,
న్నీరెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా ల్యాణమే చక్రికిన్?

టీకా:

మున్ను = ఇంతకు ముందు; ఉగ్ర = భయంకరమైన; అటవి = అడవి; లోన్ = అందు; వరాహమున = పంది; కై = కోసము; ముక్కంటి = శివుని {ముక్కంటి - మూడు కన్నులు ఉన్నవాడు, శివుడు}; తోన్ = తో; పోరు చోన్ = యుద్ధము చేయు నప్పుడు కాని; సన్నాహంబునన్ = పోరుకు దిగి నప్పుడు; కాలకేయులన్ = కాలకేయులను రాక్షసులను; అనిన్ = యుద్ధములో; జక్కాడు చోన్ = చెండాడుచు నున్నప్పుడు కాని; ప్రాభవ = వైభవమును; స్కన్నుండు = కోల్పోయిన వాడు; ఐ = అయి; చను = వెళ్లు; కౌరవేంద్రు = దుర్యోధనుని {కౌరవేంద్రుడు - కురువంశపు రాజు, దుర్యోధనుడు}; పని = పని; కై = కోసము; గంధర్వులన్ = గంధర్వులను; తోలు చోన్ = పారదోలు నప్పుడు కాని; కన్నీరు = కన్నీరు; ఎన్నడున్ = ఎప్పుడును; తేవు = తీసుకొని రాలేదు, కార్చ లేదు; తండ్రి = నాయనా; చెపుమా = చెప్పుము; కల్యాణమే = శుభమేనా; చక్రి = కృష్ణుని {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; కిన్ = కి.

భావము:

“ఇదేమి టయ్యా? కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. పూర్వం భయంకరమైన ఆ అడవిలో పంది కోసం మూడు కళ్ళున్న ఆ పరమేశ్వరునితో పోరే టప్పుడు కాని, సర్వసన్నాహాలతో వెళ్ళి కాలకేయులను కదనరంగంలో చీల్చి చెండాడే టప్పుడు కాని, పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధనుని విడిపించే పనిలో గంధర్వులను తరిమే టప్పుడు కాని ఇంతకు ముందు ఎప్పుడు కంట నీరు పెట్టి ఎరుగవు కదా. ఇప్పుడే మయిం దయ్యా? కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా? చెప్పు