పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : విదురాగమనంబు

  •  
  •  
  •  

1-313-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెట్టితిరి చిచ్చు గృహమునఁ
ట్టితిరి దదీయభార్యఁ, బాడడవులకుం
గొట్టితిరి, వారు మనుపఁగ
నెట్టన భరియింపవలెనె? యీ ప్రాణములన్.

టీకా:

పెట్టితిరి = పెట్టినారు; చిచ్చు = నిప్పు; గృహమునన్ = ఇంటికి; పట్టితిరి = పట్టుకొన్నారు; తదీయ = వారి; భార్యన్ = భార్యని; పాడు = చెడ్డ; అడవుల = అడవుల; కున్ = కి; కొట్టితిరి = గెంటివేసినారు; వారు = వారు; మనుపఁగ = పోషిస్తుండగ; ఎట్టన = ఏవిధముగ; భరియింపన్ = బలవంతముగ నిలుపుకొన; వలెను = వలెను; ఈ = ఈ; ప్రాణములన్ = ప్రాణములను.

భావము:

మీరు పాండవుల కొంపకు చిచ్చుపెట్టారు. పాండవపత్నిని నిండుసభలో చెరబట్టారు. ఆ అమాయికుల్ని అన్యాయం చేసి అరణ్యాలకు వెళ్లగొట్టారు. ఇప్పుడు ఈ విధంగా వారి అండజేరి, వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు.