ప్రథమ స్కంధము : విదురాగమనంబు
- ఉపకరణాలు:
మేలు సెప్పెనేని మేలండ్రు లోకులు,
చేటు చెప్పెనేని చెట్టయండ్రు,
నంతమీఁద శూద్రుఁ డైన కతంబున
శిష్టమరణ మతడు సెప్పఁడయ్యె.
టీకా:
మేలు = మంచి విషయము; సెప్పెనేని = చెప్పినట్లైతే; మేలు = మంచిది; అండ్రు = అందురు; లోకులు = ప్రజలు; చేటు = అశుభం, చెడ్డ విషయము; చెప్పెనేని = చెప్పినట్లైతే; చెట్ట = చెడ్డవాడు; అండ్రు = అందురు; అంత = ఆ; మీఁదన్ = పైన; శూద్రుఁడు = శూద్రుడు; ఐన = అయిన; కతంబునన్ = కారణముచేత; శిష్ట = శిష్టులయొక్క; మరణము = మరణమును; అతడు = అతడు; సెప్పఁడయ్యె = చెప్పుటలేదు.
భావము:
లోకులు మంచి విషయం చెప్పితే మేలు మేలని వింటారు. అశుభం చెబితే చెడ్డవాడంటారు. అందువల్ల సదయహృదయుడైన విదురుడు శూద్ర స్త్రీ యందు జన్మించినవాడు కనుక యదువీరుల మరణవార్తను ధర్మరాజుకు చెప్పలేకపోయాడు.