పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షి జ్జన్మంబు

  •  
  •  
  •  

1-297-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తల్లి కడుపులోపల
మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం
నుచుఁ బరీక్షింపఁగ జను
ఘుఁ బరీక్షన్నరేంద్రుఁ డండ్రు మునీంద్రా!

టీకా:

తన = తనయొక్క; తల్లి = తల్లి; కడుపు = కడుపు; లోపలన్ = లోపల; మును = ఇంతకు ముందు; సూచిన = చూచిన; విభుఁడు = ప్రభువు; విశ్వమున = లోకమునకు; ఎల్లన్ = ఎల్లెడల; కలండు = ఉన్నాడు; అనుచున్ = అని; పరీక్షింపఁగన్ = పరీక్షించుండుటచేత; జనులు = ప్రజలు; అనఘున్ = పాపములేని వానిని; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నరేంద్రుడు = రాజు; అండ్రు = అందురు; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.

భావము:

శౌనక మునీంద్రా తన కన్నతల్లిగర్భంలో మున్ను తాను సందర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమో నని పరీక్షించినందువల్ల ఆ బాలుణ్ణి లోకులు పరీక్షిత్తు అని పిలుస్తారు.