పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షి జ్జన్మంబు

  •  
  •  
  •  

1-295-భు.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రించుం గలిప్రేరితాఘంబు లెల్లన్,
రించున్ ధరన్ రామద్రుండుఁ బోలెన్,
రించున్ సదా వేదశాస్త్రానువృత్తిన్,
రించున్ విశేషించి వైకుంఠుభక్తిన్.

టీకా:

హరించున్ = పోగొట్టును; కలి = కలిచేత; ప్రేరిత = ప్రేరేపింపబడిన; అఘంబులు = పాపములు; ఎల్లన్ = అన్నిటిని; భరించున్ = పోషించును; ధరన్ = భూమిని; రామభద్రుండున్ = రామచంద్రుడు; పోలెన్ = వలె; చరించున్ = మెలగును; సదా = ఎల్లప్పుడు; వేద = వేదమును; శాస్త్ర = శాస్త్రమును; అనువృత్తిన్ = అనుసరించి; వరించున్ = కోరి స్వీకరించును; విశేషించి = ప్రత్యేకించి; వైకుంఠు = విష్ణుమూర్తి మీది {వైకుంఠుడు - విష్ణువు, వైకుంఠవాసుడు, చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమెకు జన్మించినవాడు, కుంఠనము (మొక్కపోవుట) లేని వాడు, వ్యు., వికుంఠమే (జ్ఢానమ్) + అణ్, త.ప్ర., జడమైన ప్రకృతికి జ్ఞానమొసగి యుద్దరించిన వాడు.}; భక్తిన్ = భక్తితో.

భావము:

ఇతడు కలికల్మషాలను హరిస్తాడు. శ్రీరామచంద్రుడులాగా భూభారాన్ని భరిస్తాడు. వేదశాస్త్రాలను అనుసరించి సదా చరిస్తాడు విశిష్టమైన విష్ణుభక్తిని వరిస్తాడు.